మహబూబ్ నగర్ : వైద్య విద్యార్థులు సేవా భావంతో పని చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి . శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. మంగళవారం మంత్రి ఎదిర శివారులో ఉన్న మహబూబ్ నగర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో బాలుర, బాలికల జిమ్నాయిజం, రిక్రియేషన్ కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహబూబ్ నగర్ వైద్య కళాశాలలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు.
ఎంతో శ్రమకోర్చి వైద్య కళాశాలను ప్రారంభించామని, విద్యార్థులు బాగా చదివి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ పుట్ట శ్రీనివాస్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పర్యవేక్షకుడు డాక్టర్ రామ్ కిషన్, మెడికల్ కళాశాల డాక్టర్ కిరణ్, కౌన్సిలర్ యాదమ్మ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
భూ వివాదం : సినీ నిర్మాత సి.కల్యాణ్పై కేసు నమోదు
తహసీల్దార్పై డీజిల్ పోసి హత్యాయత్నం
పల్లె ప్రగతి నిరంతరం కొనసాగాలి : మంత్రి శ్రీనివాస్ గౌడ్
పురుగుల మందు తాగి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
పల్లె ప్రగతితో ఊహించని మార్పు : మంత్రి సబిత
పల్లె ప్రగతిని పక్కాగా చేపట్టాలి : మంత్రి ఐకే రెడ్డి
వరంగల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుదాం : మంత్రి ఎర్రబెల్లి
హరితహారంతో ములుగుకు పూర్వవైభవం రావాలి