మంత్రి సబితా ఇంద్రారెడ్డికి టీఎంఎస్టీఏ వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రూ.లక్ష వరకు మెడికల్ రీయింబర్స్మెంట్ను వర్తింపజేయాలని తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ (టీఎంఎస్టీఏ) నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వినతిపత్రం సమర్పించారు. టీచర్లకు హెల్త్కార్డులు, మెడికల్ రీయింబర్స్మెంట్ సౌకర్యం లేదని, చాలామంది కొవిడ్ బారినపడి అప్పులపాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రిని కలిసినవారిలో మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్రెడ్డి, పీఆర్టీయూ తెలంగాణ ప్రధాన కార్యదర్శి చెన్నయ్య, టీఎంఎస్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు తదితరులు ఉన్నారు.