హైదరాబాద్ : కొవిడ్ రోగులను చికిత్స నిమిత్తం దవాఖానలో చేర్చుకునే విషయంపై c రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
తీవ్ర, అతి తీవ్రమైన లక్షణాలు ఉన్న వారిని మాత్రమే చేర్చుకోవాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు జీ శ్రీనివాసరావు సూచించారు.
ఆక్సిజన్ 94 శాతం కంటే ఎక్కవుంటే హోంఐసోలేషన్లో ఉంచాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో పడకల సంఖ్య వివరాలను ఎప్పటికప్పుడు బయట ఉంచాలని కోరారు.
కొవిడ్ చికిత్సకు అనుమతులు లేని దవాఖానలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. దవాఖాన నిర్వాహకులు రోగులను ఇబ్బందికి గురిచేయకుండా మానవత్వంతో వ్యవహరించి చికిత్స అందించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.