హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): డ్రోన్ల ద్వారా వైద్య పరికరాలను చేరవేసే పైలట్ ప్రాజెక్టు శుక్రవారం ప్రారంభమైంది. దేశంలోనే తొలిసారిగా బెంగళూరు అథారిటీ థ్రాటిల్ ఏరోస్పేస్ ఆధ్వర్యంలోని కంపెనీల కన్సార్టియం ఈ ప్రయోగాలు చేపడుతున్నది. సుమారు 15 కిలోమీటర్ల వరకు డ్రోన్లు వైద్య పరికరాలను తీసుకెళ్లేలా ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. మరోవైపు డ్రోన్ల ద్వారా వైద్య పరికరాలు, కరోనా వ్యాక్సిన్లను మారుమూల ప్రాంతాలకు తరలించడంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం ప్రారంభించింది.