హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ)/ తాడ్వాయి: మేడారం జాతర ట్రస్ట్ బోర్డు చైర్మన్, టీఆర్ఎస్ నాయకుడు ఆలం రామ్మూర్తి(55) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. మేడారంలోని తన స్వగృహంలో ఉంటున్న ఆయనకు ఉదయం ఛాతినొప్పి వచ్చింది. ఆయనను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ములుగుకు తరలిస్తుండగానే పస్రా సమీపంలో చనిపోయారు. రామ్మూర్తి 1998 నుంచి 2003 వరకు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా వ్యవహరించారు. 2008లో టీఆర్ఎస్లో చేరారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల అభ్యున్నతి కోసం కృషిచేశారు. 2020లో తిరిగి మేడారం జాతర ట్రస్ట్ బోర్డు పునరుద్ధరణ కమిటీ చైర్మన్గా నియమితులయ్యారు. రామ్మూర్తి మృతి పట్ల రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. మేడారం జాతర ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటిచెప్పడంలో రామ్మూర్తి ప్రముఖపాత్ర పోషించారని పేర్కొన్నారు.