మనీలా: కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా ఫిలిప్పీన్స్లో నెల రోజులుగా కొనసాగుతున్న లాక్డౌన్ను మరో రెండు వారాలు పొడిగించారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే ఒక ప్రకటన చేశారు. దేశంలో కరోనా పరిస్థితి కొంతమేర కుదుట పడుతున్నప్పటికీ వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన వెల్లడించారు. తాజాగా నిర్ణయం ప్రకారం మే 14 వరకు లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని డ్యుటెర్టే తెలిపారు.
దేశంలో 25 మిలియన్లకు పైగా ప్రజలు నివసించే మనీలా, మరో నాలుగు ప్రావిన్సుల్లో కఠిన ఆంక్షలు అమల్లో ఉంటాయని మనీలా ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు కుదేలైన వ్యాపారాలను గాడిన పెట్టేందుకు మనీలా మెట్రోపాలిటన్ మేయర్లు కర్ఫ్యూ సమయాన్ని తొమ్మిది గంటల నుంచి 6 గంటలకు తగ్గించారు. దీంతో మనీలా మేయర్లను డ్యుటెర్టే తీవ్రంగా హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
నమ్మలేని నిజం: భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి పెండ్లి చేసిన భర్త..!
రష్యా నుంచి భారత్కు రెండు విమానాల్లో భారీగా వైద్య సామాగ్రి
టీకా కోసం 1.23కోట్ల రిజిస్ట్రేషన్లు
ఊసరవెళ్లిలా రంగు మారుతున్న మహిళ చేతివేళ్లు..!