హైదరాబాద్ : ఏప్రిల్ 2021 కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పరిధిలో ప్రాక్టికల్ అండ్ థియరీ పరీక్షలకు హాజరైన ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులందరూ సంబంధిత టీచింగ్ హాస్పటల్స్లో విధులకు హాజరు కావాల్సిందిగా మెడికల్ ఎడ్యూకేషన్ డైరెక్టర్(డీఎంఈ) డాక్టర్ కె.రమేశ్ రెడ్డి ఆదేశించారు.
కొవిడ్ మహమ్మారి సమయంలో వైద్య సిబ్బంది అత్యవసర అవసరాన్ని పరిష్కరించేందుకు ఈ చర్య అని పేర్కొన్నారు. పరీక్షా ఫలితాలు ప్రకటించిన తర్వాత ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు హౌస్ సర్జన్లుగా పనిచేయడం కొనసాగించవచ్చన్నారు. అధికారికంగా చేరిన మొదటి రోజు నుండే వారికి స్టైఫండ్ చెల్లించబడుతుందని డీఎంఈ పేర్కొంది.