తిరువనంతపురం: కేరళలో కరోనా వైరస్ ఇంకా ఉధృతంగానే కొనసాగుతున్నది. అక్కడ రోజూ 10 వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం కూడా కొత్తగా 13,658 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. అదేవిధంగా కొత్తగా 142 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇప్పటివరకు కేరళలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 13,235కు పెరిగింది.
ఇక ఇవాళ కొత్తగా 11,808 మంది కరోనా బాధితులు ఆ వైరస్ బారి నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 28,09,587కు చేరింది. కాగా, ఇప్పటివకు కేరళలో పాజిటివిటీ రేటు 9.71 శాతంగా ఉన్నది. కేరళ వైద్య ఆరోగ్య శాఖ ఈ వివరాలను మీడియాకు వెల్లడించింది.