రేపు షెడ్యుల్ ప్రకటన?
హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): ఇటీవల జరిగిన పురపోరుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, మున్సిపల్ చైర్మన్ల ఎన్నిక ఈ నెల 7న జరుగనున్నది. ఈ షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించే అవకాశాలున్నాయి. 5 మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లను టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో కైవసం చేసుకొన్నది. ఈ ఏడింటిలో మేయర్, చైర్పర్సన్ పదవుల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే కూర్చోనున్నారు. వరంగల్ మేయర్ పదవి బీసీ జనరల్కు, ఖమ్మం మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యాయి. సిద్దిపేట మున్సిపల్ చైర్మన్ పదవి బీసీ మహిళకు, అచ్చంపేట జనరల్కు, నకిరేకల్ బీసీ జనరల్కు, జడ్చర్ల బీసీ మహిళకు, కొత్తూరు జనరల్ మహిళకు రిజర్వ్ చేస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.