ఎర్రజెండా ఎగిరింది. ఊరూరా రెపరెపలాడింది. మేడే సందర్భంగా కార్మికులు సోమవారం సంబురాలు జరుపుకున్నారు. పతాకాలు ఎగరేసి, ర్యాలీలు తీసి, స్వీట్లు పంచుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయం చౌరస్తా వద్ద బీఆర్టీయూ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పాల్గొని జెండా ఎగరేశారు. గోదావరిఖని ఓసీపీ-5లో కార్యక్రమానికి ఎమ్మెల్యే చందర్ ముఖ్యఅతిథిగా హాజరై జెండాను ఎగరేశారు. మంథని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ హాజరై, హమాలీలు, కూలీలకు బట్టలు పంపిణీ చేశారు.
– నమస్తే నెట్వర్క్, మే 1