టీఆర్ఎస్ పాలనను హర్షిస్తున్న ప్రజలు : ఎమ్మెల్యే చిట్టెం
రూ.1.40 కోట్లతో డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
మదనాపురం, ఏప్రిల్ 2 : తెలంగాణ ఏర్పడ్డా క పల్లెలు, పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయ ని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నా రు. ఆత్మకూరు పట్టణంలో రోడ్డు విస్తరణలో భా గంగా ప్రధాన రహదారి వెంట రూ.కోటీ 40 లక్షలతో మంజూరైన డ్రైనేజీ నిర్మాణానికి శుక్రవారం మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రితో కలిసి ఎమ్మెల్యే హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సా హసోపేత నిర్ణయాలతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని చెప్పారు. గత పాలకుల నిర్ల క్ష్యం వల్ల అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన ఆత్మకూరు పట్టణం, నేడు జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్ర జలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చె ప్పారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముం దుంచేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల దీవెనలు తమ ప్రభుత్వంపై ఇలాగే ఉండాలని ఆ యనన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండల ప్రజాప్రతినిథులు, అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.