వలిగొండ: మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. బుధ వారం మండలంలోని వెంకటాపురం పరిధిలోగల మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కొండపై ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి తాత య్య బొడ్డు రాఘవరెడ్డి జ్ఞాపకార్థం రూ.15లక్షల స్వంత నిధులతో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న అన్నదాన సత్రం నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శేఖర్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేక నిధులు కేటాయించి మత్స్యాద్రి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
భక్తుల కోసం నిర్మించే వసతి గృహాలు, కొండపైకి ఏర్పాటు చేసే లిఫ్టు నిర్మాణానికి సహకరిస్తానన్నారు. అనంతరం నిత్యా న్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే శేఖర్రెడ్డిని ఆలయ అర్చకు లు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగ తం పలికారు. స్వామివారి నిత్యకల్యాణం, నిత్యహోమం, సహస్రనామార్చన కార్యక్ర మాల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం పొందారు.
కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేశ్రాజ్, ఈవో రవికుమార్, కొత్త నర్సింహ, ఎంపీటీసీ సామ రాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ కునపూరి కవిత, పీఏసీఎస్ చైర్మన్లు సుర్కంటి వెంకట్రెడ్డి, చిట్టెడి వెంకట్రాంరెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ గూడూరు శ్రీధర్రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ఏనుగు అంజిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పైళ్ల రాజవర్ధన్ రెడ్డి, మాజీ మత్స్యగిరిగుట్ట చైర్మన్ తుమ్మల వెంకట్రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు డేగల పాండరి, వలిగొండ అధ్యక్షుడు అయిటిపాముల రవీంద్ర, రత్నయ్య, అనంతరెడ్డి, ఆలయ ధర్మకర్తలు, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.