వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీ నర సింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం భక్తులకు వసతి గృహాల తోపాటు నిత్యాన్నదాన సత్రం నిర్మాణం కోసం చేపట్టే నిర్మాణ స్థలాలలను సోమ
వారం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలించారు. కార్యక్రమంలో దేవస్థానం ఈవో రవికుమార్, వెంకటాపురం సర్పంచ్ కొత్త నర్సింహ, ధర్మకర్తలు సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.