వలిగొండ: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోనిమత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యార్థం బుధవారం నుంచి నిత్యకల్యాణం, నిత్యహోమం, సహస్రనామార్చన, నిత్యాన్నదానం నిర్వహిం చనున్నట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మత్స్యాద్రిపై అన్నసత్ర నిర్మాణానికి బుధవారం భూమి పూజ
మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండపై భక్తుల సౌకర్యం కోసం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి వారి తాత బొడ్డు రాఘవరెడ్డి జ్ఞాపకార్ధం 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించ తలపెట్టిన అన్నసత్ర నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు ఈవో కే. రవికుమార్ తెలిపారు.