వలిగొండ, ఆగష్టు15: మండలంలోని వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వారం రోజులకు గాను 11,27,022 రూపాయల ఆదాయం సమకూరినట్లు దేవస్థానం ఈవో రవికుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ ముద్దసాని కిరణ్రెడ్డి ఆదివారం తెలిపారు.
స్వామివారి ప్రసాదం అమ్మకం ద్వారా 2,09,270 రూపాయల ఆదాయం, భక్తుల దర్శనం, పూజల ద్వారా 9,17,752 రూపాయల ఆదాయం సమకూరిందని తెలిపారు.