కలిసికట్టుగా పట్టణాభివృద్ధికి కృషి చేద్దాం
మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మే3: జడ్చర్ల మున్సిపాలిటీకి మొదటిసారిగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 23 వార్డులను కౌవసం చేసుకుని ఘన విజయం సాధించిందని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మున్సిపాలిటీకి జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపును సోమవారం నిర్వహించారు. ఈ ఓట్ల లెక్కింపులో మొత్తం 27 వార్డులకుగానూ 23 వార్డులను టీఆర్ఎస్, 2 వార్డులను బీజేపీ, 2 వార్డులను కాంగ్రెస్ పార్టీలు గెలుపొందాయన్నారు. గెలుపొందిన టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు సోమవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని కలిసి సత్కరించారు. జడ్చర్లలోని తన స్వగృహానికి విచ్చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. గెలుపొందిన కౌన్సిలర్లందరూ కలిసికట్టుగా మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వార్డుల అభివృద్ధికి పాటుపడాలన్నారు. నీతినిజాయితీతో చిన్న మాట రాకుండా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఓటు వేసినా, వేయకపోయినా అందరిని సమానంగా చూడాలని, అందరితో కలిసిపోవాలన్నారు. బల్దియా ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డుకు ఐదారుగురు చొప్పున టికెట్ కోసం పోటీ పడ్డారని, వివిధ కారణాలతో అందరికీ టికెట్ ఇవ్వలేకపోయామని గుర్తు చేశారు. వీరందరూ అభ్యర్థుల గెలుపునకు తమవంతు కృషి చేశారని, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నవారే నాయకులు అవుతారన్నారు. అవకాశం రాకపోయినా పనిచేసే వారే లీడర్ అవుతారన్నారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వారిని పార్టీ ఎన్నడూ గుర్తించిందన్నారు. గట్టిపోటీ ఉందనుకున్న చోట్ల గెలుపొందామని, గెలుస్తామనుకున్న చోట్ల ఓటమి చెందామని చెప్పారు. ఏదిఏమైనా ఎక్కువ సీట్లను కైవసం చేసుకున్నామని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థులకు విజయాన్ని కట్టబెట్టిన ప్రజలందరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యేగా తాను చేస్తున్న అభివృద్ధిని చూసి టీఆర్ఎస్కు పట్టం కట్టారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక మున్సిపాలిటీలకు అధికంగా నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్చందర్, నాగిరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, కొండల్, వెంకటేశ్, మురళి, శివయ్య, పాలాది రమేశ్, పర్వత్రెడ్డి, హఫీజ్, రఘుపతిరెడ్డి, దామోదర్, పర్మటయ్య, ఇమ్మూ, నాయకులు పాల్గొన్నారు.