వరంగల్ అర్బన్ : జిల్లాలోని కమలాపూర్ మండలం గుండేడు గ్రామానికి చెందిన 200 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్, బీజేపీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు గులాబీ పార్టీలో చేరగా..పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. ముఖ్యమం త్రి కేసీఆర్ ఆదేశాల మేరకు కమలాపూర్ మండల ఇన్చార్జి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నానని, ప్రజల సమస్యల పరిష్కారం కోసం లక్ష్మీగణపతి ఫంక్షన్ హాల్ పార్టీ కార్యాలయంగా కొనసాగుతుందని తెలిపారు.
గ్రామాల్లో నెలకొన్న పనులను రెండు నెలల్లో పూర్తి చేసేందుకు కృషి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ కమలాపూర్ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అభివృద్ధి చేస్తున్న కేసీఆర్కు ప్రజలు అండగా నిలువాలని కోరారు.
కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, సర్పంచ్ల ఫోరం కన్వీనర్ రవీందర్రెడ్డి, ఎంపీటీసీల ఫోరం కన్వీనర్ సంపత్రావు, సర్పంచ్లు విజేందర్రెడ్డి, మాట్ల రవిందర్, నాయకులు పింగిళి ప్రదీప్రెడ్డి, కట్కూరి తిరుపతిరెడ్డి, లక్ష్మణ్రావు, నవీన్కుమార్ తదితరులున్నారు.
ఇవి కూడా చదవండి..
దారుణం : భార్యను చంపి భర్త ఆత్మహత్య
తండ్రిని చంపిన తనయుడు అరెస్ట్
పీవీకి సముచిత గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్
పీవీకి ఘన నివాళులు అర్పించిన మంత్రి ఎర్రబెల్లి
హ్యాట్రిక్ గోల్డ్మెడల్స్.. ఆర్చరీ రికర్వ్లో వరల్డ్ నంబర్ వన్ దీపికా
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ఇసుక అక్రమ రవాణాను తక్షణమే అరికట్టాలి