హైదరాబాద్ : ఈ నెల 15వ తేదీన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా రోడ్డుమార్గంలో యాదాద్రి బయల్దేరనున్నారు. 8:30 గంటలకు అక్కడకు చేరుకుంటారు. ఉదయం 8:45 గంటలకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం స్వామి వారి ఆశీర్వచనం తీసుకోనున్నారు. 9:15 గంటలకు ఆలయ పునర్ నిర్మాణాన్ని పరిశీలించనున్నారు. 9:45 గంటలకు వీవీఐపీ గెస్ట్ హౌజ్లో బ్రేక్ ఫాస్ట్ చేయనున్నారు. ఉదయం 10 గంటలకు టెంపుల్ సిటీని సందర్శించి, హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానున్నారు.