లూథియానా: కరోనా రెండో దశ విజృంభిస్తున్నది. దీంతో పంజాబ్లో కరోనా కేసులతోపాటు మరణాలు భారీగా నమోదవుతున్నాయి. కేవలం 44 రోజుల్లోనే మొత్తం మరణాల్లో 40 శాతం నమోదయ్యాయంటే కరోనా ఉధృతి ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంజాబ్లో మార్చి 31 నాటికి 6868 మంది బాధితులు మరణించారు. మే 14 నాటికి ఆ సంఖ్య 11,477కు చేరింది. అంటే 44 రోజుల్లో 4609 మంది మృతిచెందారు. రాష్ట్రంలో గత కొన్నిరోజులుగా ప్రతిరోజు వంద మందికిపైగా కన్నుమూస్తున్నారు. మే 11న ఒకేరోజు 217 మంది చనిపోయారు. మార్చి 31 నాటికి 2,39,734 కేసులు ఉండగా, మే 14 నాటికి ఆసంఖ్య 4,83,984కు పెరిగింది.
పంజాబ్లో లూథియానాలో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఏప్రిల్ 1 నుంచి మే 14 మధ్య జిల్లాలో 538 మంది మరణించగా, అమృత్సర్లో 515 మంది బాధితులు మృతిచెందారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి