ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 18: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో షీ టాయిలెట్లు నిర్మించేందుకు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) హర్షం వ్యక్తంచేసింది. సంఘం మహిళా ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం ఔటా కార్యాలయంలో సంఘం ఉపాధ్యక్షురాలు ప్రొఫెసర్ లావణ్య మీడియాతో మాట్లాడుతూ.. అన్ని యూనివర్సిటీల్లో షీటాయిలెట్ల ఏర్పాటు కోసం రూ.పది కోట్లు కేటాయించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ మనోహర్, ప్రతినిధులు ప్రొఫెసర్ జీ విజయలక్ష్మి, స్వాతి, విజయ, ఎం కవిత, మాధురి, సుశీల, నమ్రత, సునీత, నవీన, లోక పావని, వీ శ్రీలత, అరుణ, కే సాధన, ప్రొఫెసర్ కృష్ణయ్య, ప్రొఫెసర్ ఉమేశ్, ప్రొఫెసర్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో విద్యారంగాన్ని సంపూర్ణంగా, సమగ్రంగా మార్చేందుకు రూ.4 వేల కోట్లను కేటాయించడాన్ని సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) ఫోరం స్వాగతించింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం హర్షణీయమని ఫోరం అధ్యక్షుడు ఎండీ ఖమ్రెద్దీన్, ప్రధాన కార్యదర్శి వీ చంద్రారెడ్డి పేర్కొన్నారు.బడ్జెట్లో ఇంటర్ ఉచిత విద్యకోసం రూ.3 కోట్లను కేటాయించడంపై ఇంటర్ విద్యాజేఏసీ చైర్మన్ పీ మధుసూదన్రెడ్డి, కళింగ కృష్ణకుమార్, కవితాకిరణ్, విజయ్శేఖర్, అవనాశ్రెడ్డి, కృష్ణారెడ్డి, రాజన్న తదితరులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్లో నీటిపారుదలరంగానికి సుమారు రూ.17వేల కోట్లు కేటాయించడంపై తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్స్ అసోసియేషన్ (ట్రీ) హర్షం వ్యక్తంచేసింది. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా గతేడాదితో పోల్చితే సుమారు రూ.6 వేల కోట్లు కేటాయింపులు పెంచడం సీఎం కేసీఆర్ భగీరథ సంకల్పానికి నిదర్శనమని ట్రీ అధ్యక్షుడు గోలి దామోదర్రెడ్డి, ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు.