బోడుప్పల్, సెప్టెంబర్ 5: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచర్ల పూసలి గోడౌన్లో హమాలీ సంఘం రాష్ట్ర నాయకుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడారు. అసంఘటిత కార్మిక వర్గాలను అన్ని విధాలా ఆదుకున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్రెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.