జీహెచ్ఎంసీ పోలింగ్ గతం కంటే ఎక్కువే.. ప్రకటించిన ఈసీ

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం గతంలోకంటే స్వల్పంగా పెరిగింది. మొత్తం 150 డివిజన్లలో 149 డివిజన్లకు నిన్న ఎన్నికలు జరిగాయి. ఇందులో 46.6 శాతం పోలింగ్ నమోదయ్యిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 2016 బల్దియా ఎన్నికల్లో 45.29 శాతం పోలింగ్ నమోదయ్యింది. అంటే గతంలోకంటే ఈ ఎన్నికల్లో 1.31 శాతం పోలింగ్ పెరిగింది. నిన్న అర్ధరాత్రి వరకు 45.97 శాతం పోలింగ్ జరిగిందని, పూర్తి వివరాలు ఇవాళ ఉదయం వెల్లడిస్తామని ప్రకటించింది. దీంతో ఇవాళ పోలింగ్ 46.6 శాతంగా నమోదైనట్లు వెల్లడించింది.
ఇప్పటివరకు జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ శాతం కావడం విశేషం. 2016లో 45.29 శాతం, 2009 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 42.04 శాతం, 2002 ఎన్నికల్లో 43.27 శాతం పోలింగ్ నమోదయ్యింది. అయితే గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 50 శాతానికిపైగా పోలింగ్ నమోదవడం విశేషం. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 50.86 శాతం, 2018లో 53 శాతం పోలింగ్ నమోదయ్యింది.
గ్రేటర్ పరిధిలోని మొత్తం 150 డివిజన్లకుగాను 149 డివిజన్లలో నిన్న పోలింగ్ జరిగింది. ఓల్డ్ మలక్పేట్ డివిజన్లో ఎన్నికల గుర్తులు తారుమారు కావడంతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. అక్కడ రేపు పోలింగ్ నిర్వహించనున్నారు. డిసెంబర్ నాలుగున ఓట్లను లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.
1.31 high polling percentage in GHMC Elections
తాజావార్తలు
- దక్షిణాదిలో సత్వరమే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి
- కూల్డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా కాన్ఫిడెన్షియల్ డేటా చోరీకి టెక్కీ యత్నం!
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
- మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని సందర్శించిన మంత్రులు
- రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ డేవిడ్ మృతి
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో
- మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి రైతు మృతి