జడ్చర్ల టౌన్, మే 2 : జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లె క్కింపునకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు కలెక్టర్ ఎస్.వెంకట్రావు తెలిపారు. కొవిడ్ నిబంధనల మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఆ దివారం జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లో ఏర్పాటు చేసిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. కౌంటింగ్కు సంబంధించి అ ధికారులకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోమవారం నిర్వహించనున్న ఓ ట్ల లెక్కింపు సందర్భంగా కొవిడ్ నెగెటి వ్ సర్టిఫికెట్ లేకుండా కౌంటింగ్, బందోబస్తు సిబ్బందిగానీ, అభ్యర్థులు, ఏజెంట్లను గానీ, ఎవరిని కూడా కేం ద్రంలోని అనుమతించకూడద ని ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారిని హెల్త్ నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. పాల్గొనే సిబ్బంది, అభ్యర్థులు ఎన్-95 మాస్కులు, ఫేస్షీల్డ్, శానిటైజర్ను వినియోగించాలన్నారు. మొత్తం 5 కౌంటింగ్ హాల్స్, 19 టేబుళ్లను ఏర్పాటు చేశామని, పో లీస్ సిబ్బందితో కలిపి మొత్తం 350 మంది కౌంటింగ్లో పాల్గొంటారన్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో మూడంచెల భద్రత ను ఏర్పాటు చేశామని, సీసీ కెమెరాలతో నిఘా పటిష్టం చేసినట్లు తెలిపారు. వీడియో కెమెరాతో లెక్కింపు ప్రక్రియను చి త్రీకరించనున్నట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగాలన్నారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ సునీత పాల్గొన్నారు.