మహబూబ్ నగర్ : ప్రభుత్వం ప్రారంభించిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. జిల్లాలోని హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామంలో పీఏసీసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం పండించిన ప్రతి ధాన్యం గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. రైతుల నుంచి దళారులు తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి మళ్లీ అధిక ధరకు ప్రభుత్వానికే విక్రయిస్తున్నారని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల్లో ఏ-గ్రేడ్ క్వింటాకు రూ.1,888 ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. తూకంలో ఎవరైనా మోసం చేస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
కరోనాపై రైతులు జాగ్రతగా ఉండి మాస్కులు ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాల్ రాజ్ , జెడ్పీటీసీ విజయ నిర్మల, సర్పంచ్ మానస, నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
హత్యకేసు నిందితుడికి జీవిత ఖైదు
దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అధికారులు
కరోనా ఉధృతిపై వరంగల్లో మంత్రుల సమీక్ష
మానవత్వాన్ని చాటుకున్న సూపర్ స్టార్..!
సమన్వయంతో పని చేద్దాం..కరోనాను తరిమేద్దాం