పెద్దపల్లి : మావోయిస్టు అగ్రనేతలు జన జీవన స్రవంతిలో కలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని శివాలయం వీధిలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు తల్లి మల్లోజుల మధురమ్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పండ్లు, బట్టలు అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. కరోనా మహమ్మారితో ఛత్తీస్గఢ్, ఒడిషా రాష్ట్రాల్లో అగ్ర నాయకులంతా అనారోగ్యంతో బాధపడుతున్నారని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికైనా అగ్రనేతలైన వేణుగోపాలరావు, మల్ల రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు తదితర నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పెద్దపెల్లి జోన్ డీసీపీ రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐలు, ఎస్ఐలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మినీ ఇండియాగా శ్రీరామ కాలనీ : మంత్రి సబిత
కాగజ్నగర్లో భారీ గుట్కా డంప్ స్వాధీనం
పెద్దపల్లిలో సఖీ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి కొప్పుల
హుజురాబాద్లో గులాబీ జెండా ఎగరడం ఖాయం
మానవత్వం చాటిన పోలీస్ అధికారులు
పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం