నిర్ధారించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్
కొత్తగూడెం క్రైం : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాపా నారాయణ అలియాస్ హరిభూషణ్ (50) గుండెపోటుతో మృతి చెందినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. బుధవారం ఎస్పీ సునీల్ దత్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. హరిభూషణ్ మృతికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గత కొంత కాలంగా కరోనాతో బాధపడుతున్న హరిభూషణ్ గుండెపోటుతో మృతి చెందాడని ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. హరిభూషణ్ భార్య శారదతో సహా మరికొంతమంది అగ్రనాయకులు కరోన సోకి బాధపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ (ఆపరేషన్స్) వుప్పు తిరుపతి పోలీస్ పీఆర్వో దాములూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.