మహబూబాబాద్ : మావోయిస్టు హరిభూషణ్ భార్య శారదక్క చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మహబూబాబాద్ ఎస్పీ కోటిరెడ్డి స్పందించారు. కరోనాతో శారదక్క చనిపోయినట్లు సమాచారం అందిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలే కరోనాతో మావోయిస్టు నేత హరిభూషణ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కరోనా బారిన పడిన మావోయిస్టులు లొంగిపోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. పోలీసు శాఖ తరపున వారికి మెరుగైన వైద్యసేవలు అందిస్తామని ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు.