హైదరాబాద్ : కరోనా బారినపడిన మావోయిస్టు గడ్డం మధుకర్ చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతి చెందాడు. కరోనా బారినపడిన ఆయన చికిత్స కోసం ఈ నెల 2న వరంగల్కు వచ్చి అక్కడి పోలీసులకు చిక్కాడు. దీంతో ఆయనను పోలీసులు హైదరాబాద్లోని ఉస్మానియా దవాఖానలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఉదయం గుండెపోటుకు గురై మధుకర్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. గడ్డం మధుకర్ 22 ఏళ్ల క్రితం పీపుల్స్వార్లో చేరారు. ప్రస్తుతం దండకారణ్య స్పెషల్ జోన్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా ఆయన వ్యవహరిస్తున్నాడు. మధుకర్ స్వస్థలం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కొండపల్లి గ్రామం. మధుకర్ మృతదేహాన్ని పోలీసులు స్వస్థలానికి తరలించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.