లక్నో : వివాహేతర సంబంధం ఓ వివాహిత ప్రాణాలను బలిగొన్నది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బులంద్షాహార్ జిల్లాలో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. దిబాయిపూర్కు చెందిన వినీత్ తన మేనకోడలు(26)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇటీవలి కాలంలో వీరిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అయితే ఫిబ్రవరి 14న ఆమె తన అత్తమామల ఇల్లును వదిలి.. నోయిడాలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. సదరు బంధువుకు ఆమె అత్తమామల నుంచి ఒత్తిడి అధికమవడంతో.. మార్చి 7న తిరిగి దిబాయిపూర్లో వదిలిపెట్టాడు. ఈ క్రమంలో వినీత్ను సోదరి నివాసమైన మీరట్కు పంపించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ అంతలోనే ఘోరం జరిగిపోయింది. వినీత్ తన మేనకోడలిపై సోమవారం సాయంత్రం కత్తితో దాడి చేసి చంపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.