ట్రోఫీని కైవసం చేసుకున్న బోధన్ జట్టు
బోధన్, ఏప్రిల్ 6: పట్టణంలోని నిజాంషుగర్ ఫ్యాక్టరీ మైదానంలో 22 రోజులపాటు కొనసాగిన ఎమ్మెల్యే షకీల్ ఆమేర్ ట్రోఫీ రాష్ట్రస్థాయి క్రికెట్ టోర్నీ మంగళవారం ముగిసింది. గ్రాండ్ ఫైనల్స్లో బోధన్ పట్టణంలోని ఆచన్పల్లికి చెందిన అతార్ ఎలెవన్ దబాంగ్ రైడర్స్ జట్టు బాన్సువాడకు చెందిన ఎంసీసీ జట్టుపై విజయం సాధించి ట్రోఫీని కైవసం చేసుకుంది. బాన్సువాడకు చెందిన ఎంసీసీ జట్టు ద్వితీయస్థానంలో నిలిచింది. విన్నర్స్కు ట్రోఫీతో పాటు రూ.2 లక్షల నగదు బహుమతి, రన్నర్స్గా నిలిచిన బాన్సువాడ టీమ్కు ట్రోఫీతో పాటు రూ.లక్ష నగదు బహుమతిని అతిథులు అందజేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన మున్నా షేక్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచిన రుషికేశ్ నాయర్కు బహుమతులు ఇచ్చి అభినందించారు. ముగింపు కార్యక్రమానికి బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్రెడ్డి, జడ్పీ వైస్ చైర్పర్సన్ రజితా యాదవ్, ఆర్డీవో రాజేశ్వర్, ఏసీపీ రామారావు, ఏఎంసీ చైర్పర్సన్ అర్చన , ఎమ్మెల్యే షకీల్ సోదరుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ సోహైల్ ఎహెతే షా కుమారులు ఆమన్, అప్పాన్ తదితరులు హాజరయ్యారు.