టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీల నేతల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకుంటున్నట్టు పలువురు నాయకులు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, సుడా చైర్మన్ జీవి రామకృష్ణారావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్టు పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమమే అజెండాగా రాష్ట్ర సర్కారు పనిచేస్తున్నదని వెల్లడించారు. పార్టీలో చేరినవారిలో భోగంపాడు మాజీ సర్పంచ్ మూల సాంబమూర్తి, చిన్నకోమటిపల్లి మాజీ సర్పంచ్ మూడెడ్ల కుమార్, చుక్క చందు, బైరెడ్డి నారాయణ రెడ్డి, కడవి ఓదెలు, చల్లూరి కృష్ణ, బిరుడు విష్ణువర్ధన్ రెడ్డి, అబ్బిడి మహిపాల్ రెడ్డి, ఏనుగు అభిలాష్ రెడ్డి, పైండ్ల తిరుపతి రెడ్డి, పిల్లి విజయేందర్ తదితరులు ఉన్నారు.