నెల్లికుదురు, ఏప్రిల్ 19 : పేదింటి ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసీఆర్.. మేనమామ కట్నంగా కల్యాణలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 157 మంది లబ్ధిదారులకు సోమవారం రూ.కోటీ 57లక్షల 18వేల 212 కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్లల తలిదండ్రులు తమ కూతర్లు పెళ్లిలు చేయడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నరని బావించి ఎక్కడాలేని విధంగా కల్యాణలక్ష్మి పథకంను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమవుతాయని, మద్దతు ధరను చెల్లిస్తూ చివరి గింజ వరకూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. మధ్య దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్రెడ్డి, ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ భూక్యా బాలాజీ నాయక్, వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేశ్, సోసైటీ చైర్మన్లు గుండా వెంకన్న, దేవేందర్రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తి ని అనిల్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బా నోత్ భీముడు, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ కాసం వెంకటేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్రెడ్డి, మండల మీడియా ఇన్చార్జి కాసరబోయిన విజయ్యాదవ్, నాయకులు కొమ్ము అనిల్, శ్రీనివాస్, ప్రవీణ్ పాల్గొన్నారు.