హైదరాబాద్: మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) రెగ్యులర్ మోడ్ పీహెచ్డీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్ల కోసం ఆన్లైన్ ప్రవేశ ప్రక్రియను ప్రారంభించింది. ప్రధాన క్యాంపస్ హైదరాబాద్తో పాటు లక్నో, శ్రీనగర్ క్యాంపస్లలో ప్రవేశాలను ఆహ్వానిస్తుంది. 2021-2022 విద్యా సంవత్సరానికి గాను స్కూల్స్ ఆఫ్ లాంగ్వేజెస్, ఎడ్యూకేషన్, ఆర్ట్స్ & సోషల్ సైన్సెస్, టెక్నాలజీ, మాస్ కమ్యూనికేషన్ & జర్నలిజం, కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ సైన్సెస్ లో 23 పీహెచ్డీ, 21 పీజీ, 8 అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో మను ప్రవేశాలను అందిస్తుంది.
ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 12 కాగా, మెరిట్ ఆధారిత కోర్సుల కోసం ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 4 వరకు సమర్పించవచ్చు. అదేవిధంగా పార్ట్టైమ్ ప్రోగ్రామ్లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబర్ 15. కోర్సుల బోధన, పరీక్ష ఉర్దూలో మాత్రమే ఉంటుందని విశ్వవిద్యాలయం తెలిపింది.
ఆన్లైన్ అప్లికేషన్, ఇ-ప్రాస్పెక్టస్, ఇతర వివరాల కోసం, https://manuu.edu.in/ వెబ్సైట్ను సందర్శించాల్సిందిగా సూచించింది. ఏదైనా సమాచారం కోసం admissionsregular@manuu.edu.in కు ఇ-మెయిల్ చేయొచ్చంది. సాధారణ ప్రశ్నలకు అడ్మిషన్ హెల్ప్డెస్క్ను నంబర్లు 9523558551, 9866802414, 6302738370 & 9849847434 లను సంప్రదించవచ్చిన పేర్కొంది.