షూటింగ్ ప్రపంచకప్
న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్ ఆధిపత్యం కొనసాగుతున్నది. శనివారం జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో విజయవీర్ సింగ్, తేజస్విని స్వర్ణ పతకం దక్కించుకున్నారు. ఫైనల్లో 9-1తో భారత్కే చెందిన గుర్ప్రీత్ సింగ్, అశోక్ అభిజ్ఞపై విజయ్వీర్ ద్వయం గెలిచింది. కాగా మిక్స్డ్ ట్రాప్ ఈవెంట్లో శ్రేయసి సింగ్, కైనన్ షెనాయ్ ద్వయం నాలుగో స్థానానికే పరిమితమైంది. 35-38 తేడాతో టర్కీ షూటర్లు సరితర్క్, యవుజ్ ఇనామ్ చేతిలో శ్రేయసి జోడీ ఓడి పతకాన్ని చేజార్చుకుంది. 13 స్వర్ణాలు సహా మొత్తం 27 పతకాలతో పట్టికలో భారత్ టాప్లో కొనసాగుతున్నది.