మంచిర్యాల అర్బన్ : మంచిర్యాల పట్టణంలోని 24వ వార్డు రెడ్డి కాలనీకి చెందిన డాక్టర్ చీకోటి శ్రీకాంత్, డాక్టర్ శ్రావణి దంపతుల కుమారుడు శ్రేయాంక్కు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్సులో బుధవారం చోటు దక్కింది. స్థానిక కార్మల్ స్కూల్లో మూడో తరగతి చదువుతున్న శ్రేయాంక్(7) ఏ దేశం పటం చూపించినా.. వెంటనే పేరు చెప్పడమేగాకుండా 54 సెకండ్లలో 150 దేశాల పతాకాలను వరుసగా ఎటువంటి తడబాటు లేకుండా చెప్పి రికార్డు సృష్టించాడు.
వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇంటర్నేషనల్ ప్రతినిధి డాక్టర్ రంగ జ్యోతి ఆధ్వర్యంలో శ్రేయాంక్ ఈ ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ రంగ జ్యోతి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో శ్రేయాంక్ పేరు నమోదు చేసి పథకాలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ వేములపల్లి సంజీవి, శ్రేయాంక్ తల్లిదండ్రులు డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శ్రావణి, చందూరి పురుషోత్తం, మాధవి, చీకోటి మేధ ఉన్నారు.