సీఐ ఇంద్రసేనారెడ్డి
వెన్నంపల్లిలో వైకుంఠరథానికి ప్రారంభోత్సవం
ఆర్యవైశ్యులకు సన్మానం
కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్26: సామాజిక సేవలో ప్రతి ఒక్కరూ ముందుండాలని సుల్తానాబాద్ సీఐ ఇంద్రాసేనారెడ్డి సూచించారు. కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి, మంగపేట, కూనారం, జాఫర్ఖాన్పేట గ్రామాల ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని సోమవారం వెన్నంపల్లిలో ప్రారంభించి, మాట్లాడారు. నిరుపేద కుటుంబాలకు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఆర్యవైశ్యులు సొంతంగా వైకుంఠరథాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. ఈ సందర్భంగా వై కుంఠరథాన్ని సమకూర్చిన ఆర్యవైశ్యులను సీఐ అభినందించి, శాలువాతో సత్కరించారు. అదే గ్రామానికి చెందిన అప్పని రాజమ్మ అనే మానసిక వృద్ధురాలు పంచాయతీ కార్యాలయం వద్ద ఒంటిపై సరిగ్గా బట్టలు లేకుండా ఉండడాన్ని చూసి చలించిన సీఐ, ఆమెకు శాలువా, చీరెతో పాటు, కొంత నగదు అందజేసి ఉదారత చాటుకున్నారు. ఇక్కడ ఎంపీపీ నూనేటి సంపత్, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, సర్పంచ్ కాసం శ్రీనివాస్డ్డి, ఎంపీటీసీ జెట్టి దేవన్న, ఆర్యవైశ్య సంఘం నాయకులు తమ్మిశెట్టి నాగభూషణం, సిరంజి రమేశ్, సోమ ఆంజనేయులు, కొల్లూరి శ్రీనివాస్, ఇమ్మడి రాజన్న, రంగు రాజన్న, శ్రీధర్, నాగభూషణం, ఎస్ఐ వెంకటేశ్వర్, నాయకులు సత్యనారాయణ, రమేశ్ ఉన్నారు.