హైదరాబాద్ : రామప్ప ప్రాంత పరిరక్షణకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక నిర్వహణ కమిటీని అదేవిధంగా స్థానిక స్థాయిలో పాలంపేట్ ప్రత్యేక అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేయడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గురువారం నగరంలోని రవీంద్ర భారతీలో గల మంత్రి కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రామప్పకు త్వరలోనే యునెస్కో గుర్తింపు లభించనున్నట్లు తెలిపారు. రామప్పకు యునెస్కో గుర్తింపు చివరి దశకు చేరిందన్నారు. ప్రభుత్వం చర్యల వల్లే యునెస్కో గుర్తింపు దక్కనుందన్నారు. యునెస్కో గుర్తింపు కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. రామప్ప సమీపంలోని రెండు ఆలయాలను కూడా రామప్ప ఆస్తి పరిధిలోకి తేనున్నట్లు మంత్రి వెల్లడించారు.