ముంబై: జూలైలో శ్రీలంకలో పర్యటించే భారత క్రికెట్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్గా వ్యవహరించనున్నాడు. శ్రీలంకతో సిరీస్లో భారత జట్టుకు ద్రవిడ్ కోచ్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ధ్రువీకరించాడు. వచ్చే నెల 13 నుంచి 25 వరకు జరిగే ఈ టూర్కు 20 మంది సభ్యుల జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. లంకతో పర్యటన కోసం భారత జట్టు సోమవారం తమ 14 రోజుల క్వారంటైన్ను ప్రారంభించింది.
కోచింగ్లో ద్రవిడ్కు అపారఅనుభవం ఉంది. గత కొన్నేళ్లుగా ఇండియా అండర్-19, ఇండియా-ఏ జట్లకు కోచింగ్ ఇస్తున్నాడు. శ్రీలంకలో పర్యటించే భారత జట్టు కెప్టెన్గా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ నియమితుడైన విషయం తెలిసిందే. ఆతిథ్య లంకతో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది.