Telangana
- Jan 27, 2021 , 17:40:18
VIDEOS
ఎన్ఎస్పీ కెనాల్లో మాజీ మంత్రి పీఏ గల్లంతు

ఖమ్మం : నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాలువలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. ఈ ఘటన ఖమ్మం నగరం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. గల్లంతైన వ్యక్తి మాజీ మంత్రి రేణుకా చౌదరి పీఏ నున్న రవిగా సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి బుధవారం ఉదయం స్నేహితులతో కలిసి కరుణగిరి ప్రాంతంలోని కాలువకు ఈతకు వెళ్లాడు. కాగా ఉన్నట్లుండి రవి ఒక్కసారిగా నీటిలో గల్లంతయ్యాడు. ప్రత్యక్షసాక్షి, రవికి ఈత నేర్పిన వ్యక్తి సీహెచ్ వెంకటేశ్వర్ రావు మాట్లాడుతూ.. రవి గుండెపోటుకు గురైఉండొచ్చని అందువల్లే నీటి సుడుల్లో చిక్కి గల్లంతైనట్లుగా అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
- ఎంపీ నంద్కుమార్ సింగ్ చౌహాన్ మృతికి రాష్ట్రపతి సంతాపం
- ఇన్స్టాలో జాన్ అబ్రహం షర్ట్లెస్ పిక్ వైరల్!
- పవన్ ఫుల్బిజీ..ఒకే రోజు రెండు సినిమాలు
- కంట్లో నీళ్లు రాకుండా ఉల్లిపాయలకు కోయడమెలా
- రూ. ౩ లక్షల విలువైన గంజాయి పట్టివేత
- ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ రేసులో అశ్విన్..పోటీలో ముగ్గురు
- పోర్ట్ ప్రాజెక్టుల కోసం ఆరు లక్షల కోట్లు పెట్టుబడి
- ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ కవిత జన్మదిన శుభాకాంక్షలు
- రోహిత్ శర్మ పోస్ట్..సోషల్మీడియాలో ఫన్నీ మీమ్స్
- కాంగ్రెస్లో ముదురుతున్న లొల్లి.. ఆనంద్శర్మ vs అధిర్ రంజన్
MOST READ
TRENDING