ఆదిలాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎదురుగా అతివేగంగా దూసుకొచ్చిన కారు బైక్ను ఢీకొట్టడంతో ఓ వ్యక్తి 20 ఫీట్లు పైకి ఎగిరి ఓ చెట్టుపై చిక్కుకున్నాడు. తీవ్రగాయాతో అక్కడే వేలాడుతూ ప్రాణాలు వదిలాడు. హర్రర్ సినిమాల్లో మాదిరి జరిగిన ఈ ప్రమాదం నిర్మల్ జిల్లాలో బుధవారం చోటుచేసుకున్నది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం నీలాగొందికి చెందిన సోయం మాన్కు(25) బైక్పై మంచిర్యాలకు వెళ్తున్నాడు. కడెం మండలం దోస్త్నగర్ వద్ద అటవీ ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ఓ కారు అతివేగంగా బైక్ను ఢీకొట్టింది. దీతో 20 ఫీట్ల ఎత్తుకు ఎగిరి రెండు చెట్ల మధ్య ఇరుక్కుని మాన్కు అక్కడికక్కడే మృతిచెందాడు. సమచారం తెలుసుకొన్న పోలీసులు చెట్టుపై వేలాడుతున్న మృతదేహాన్నిఉట్నూర్ దవాఖానకు తరలించారు.