నిర్మల్: ఇంటి పక్కన ఉన్న తోటలో గంజాయి మొక్కలు సాగుచేస్తున్న వ్యక్తిని నిర్మల్ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కుబీర్ మండలంలోని చోండికి చెందిన ముత్యన్న తన ఇంటి పక్కనే ఉన్న స్థలంలో వివిధ రకాల మొక్కలతో తోటను సాగుచేస్తున్నాయి. అందులో గంజాయి మొక్కలు కూడా ఉన్నాయి. బుధవారం ఉదయంలో గ్రామంలో పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా తోటలో పది గంజాయి మొక్కలను గుర్తించారు. దీంతో తోట యజమాని అయిన ముత్యన్నను పోలీసులు అరెస్టు చేశారు.