వర్ధన్నపేట, మే 5: పార్టీలో అంతర్గత విభేదాల కారణంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి వరదరాజేశ్వర్రావు పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి పాలవ్వడం ఎంతో కలచివేసిందని చెప్పారు. మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణతోపాటు తాను కూడా పార్టీకి రాజీనామా చేశానని తెలిపారు. త్వరలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తామని వరద రాజేశ్వర్రావు చెప్పారు.