నాగర్ కర్నూలు : జిల్లాలోని శ్రీపూర్, ఫుల్జాల గ్రామాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని..పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ లాల్ అన్నారు. శ్రీపూర్, ఫుల్జాల గ్రామాల్లో ఆయన పర్యటించారు.
కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారి ఇళ్లను సందర్శించి వారి ఆరోగ్య సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్గా నిర్ధారణ అయిన వ్యక్తులు ఇంట్లో ఉన్నా కూడా మాస్కులు ధరించాలని, ఐసోలేషన్ నిబంధనలు పాటించాలన్నారు.
ఐసోలేషన్ లో ఉండలేని వాళ్లు ప్రభుత్వ కొవిడ్ కేర్ సెంటర్లను వినియోగించుకోవాలన్నారు. ఉయ్యాలవాడలో 50, తాడూర్ లో 50 పడకల సామర్థ్యం ఉన్న ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అంబులెన్స్లో ప్రసవం..తల్లి, బిడ్డ క్షేమం
దళారుల బెడద అరికట్టేందుకే కొనుగోలు కేంద్రాలు
తెలంగాణలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు
రాధాకృష్ణను పరామర్శించిన మంత్రి ఐకే రెడ్డి