జమ్ము : జమ్మకశ్మీర్లోని సాంబా జిల్లాలో గల అంతర్జాతీయ సరిహద్దు వద్ద బొర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) సిబ్బంది పాకిస్థాన్కు చెందిన ఓ చొరబాటుదారుడిని అరెస్టు చేసింది. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. రాత్రి వేళల్లో సరిహద్దు వెంట అంతర్జాతీయ సరిహద్దను దాటుతున్న పాకిస్థాన్ జాతీయుడు అనుమానాస్పద కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అరెస్టు చేశారు. మార్చి 16న సైతం భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు సరిహద్దు దాటుతున్న పాకిస్థానీయుడు ఎన్ని హెచ్చరికలు చేసిన వినకపోవడంతో బీఎస్ఎఫ్ సిబ్బంది అతడిని కాల్చి చంపారు.