హైదరాబాద్, ఆగస్టు 19: న్యూస్ క్రెడిబిలిటీలో పేపర్లే మేలని పరిశోధన చేసి తేల్చిన ఓయూ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగానికి చెందిన స్కాలర్ డాక్టర్ బొల్లం తిరుపతి అరుదైన అవార్డుకు ఎంపికయ్యారు. ఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసెర్చ్ ఈయనకు పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్ (పీడీఎఫ్) అవార్డును ప్రకటించింది. జర్నలిజంలో పీహెచ్డీ పూర్తి చేసిన బొల్లం తిరుపతి.. దేశవ్యాప్త స్క్రూటినీలో అవార్డుకు ఎంపికయ్యారు. ఈయన ‘న్యూస్ చానల్స్ రేటింగ్స్ అండ్ క్రెడిబిలిటీ – ఏ కేస్ స్టడీ ఆఫ్ ఏపీ, తెలంగాణ’ అంశంపై ఐదేండ్ల పాటు పరిశోధన చేశారు. జాతీయ స్థాయిలో జర్నలిజం విభాగంలో పీడీఎఫ్ అవార్డు దక్కటం ఇదే తొలిసారి.