హైదరాబాద్/సిటీబ్యూరో, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పీజీఈసెట్ మొదటి విడుత వెబ్కౌన్సిలింగ్లో పలు మార్పులు చేసినట్టు అడ్మిషన్స్ కన్వీనర్ ప్రొఫెసర్ రమేశ్బాబు తెలిపారు. ఆన్లైన్ రిజిస్ర్టేషన్, ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల అప్లోడింగ్ గడువు సోమవారంతో ముగియగా, తాజాగా ఈ నెల 25వరకు పొడగించామని చెప్పారు.
మొత్తంగా 17,628 మంది పీజీఈసెట్లో అర్హత సాధించగా, కేవలం 7,500 విద్యార్థులు మాత్రమే సర్టిఫికెట్లను అప్లోడ్చేశారని, ఈ నేపథ్యంలో గడువును పొడగించామని వివరించారు. నవంబర్ 15వ తేదీ నుంచి ఈ కోర్సులకు తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు.