హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): టీ హబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా ఎం శ్రీనివాసరావు నియమితులయ్యారు. మూడేండ్లుగా సీఈవోగా పనిచేస్తున్న రవినారాయన్ పదవికాలం ముగియడంతో ఆ స్థానంలో శ్రీనివాసరావును ప్రభుత్వం నియమించింది. స్టార్టప్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా టీ హబ్ను నిర్వహిస్తున్నది. కొత్తగా సీఈవో శ్రీనివాసరావు ఓయూలో ఇంజినీరింగ్ విద్యను, ఐఐఎం బీ గ్రాడ్యుయేట్ను పూర్తి చేశారు. ఎంటర్ప్రెన్యూర్గా ఎన్నో ఆవిష్కరణలు రూపొందించారు. సైబర్ సెక్యూరిటీ సంస్థ అయిన ఆజాస్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు.