వాషింగ్టన్ : అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) కొత్త వార్నింగ్ ఇచ్చింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్నవారిలో అరుదైన నాడీ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు చెప్పింది. గుయిల్లెయిన్ బారీ సిండ్రోమ్(జీబీఎస్) సమస్యలు ఉత్పన్నం అయ్యే ఛాన్సు ఉన్నట్లు ఎఫ్డీఏ పేర్కొన్నది. ఫిబ్రవరిలో జాన్సన్ అండ్ జాన్సన్ టీకాకు ఎమర్జెన్సీ అనుమతి దక్కిన విషయం తెలిసిందే. నిజానికి అమెరికాలో ఈ టీకాను పెద్దగా వాడలేదు. కానీ జీబీఎస్ లక్షణాలు ఉన్న వంద కేసులను గుర్తించినట్లు చెప్పారు. సుమారు కోటి 20 లక్షల మందికి జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను వేశారు. తాజా అధ్యయనం ప్రకారం 95 మంది తీవ్రమైన జీబీఎస్ లక్షణాలతో ఆస్పత్రి పాలయ్యారు. దాంట్లో ఒకరు మరణించినట్లుత ఎలుస్తోంది. జీబీఎస్ ద్వారా.. శరీరంలోని రోగ నిరోధక శక్తి దెబ్బతింటుంది. నాడీ కణాలు కుప్పకూలిపోతాయి. దీంతో కండరాల బలహీనమవుతాయి. సీరియస్ కేసుల్లో పక్షవాతం వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీకా తీసుకున్న 42 రోజుల తర్వాత లక్షణాలు కనిపిస్తాయని, కానీ ఈ కేసులు అత్యంత అరుదు అని సర్వే నివేదికలో తెలిపారు.