నల్లగొండ: జిల్లాలోని అనుముల మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని తెట్టేకుంటలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన మట్టపల్లి కొండలు (21), సంధ్య (19) గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వారి ప్రేమకు ఇరువురి కుటుంబాలు అంగీకరించలేదు.
దీంతో రెండు రోజుల క్రితం ఇద్దరు తెట్టేకుంట సమీపంలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గుర్తించిన స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.