వరంగల్ అర్బన్ : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా కమలాపూర్ మండలంలోని కమలాపూర్, కానిపర్తి, కన్నూరు, గుండేడు, శంభునిపల్లి, మర్రిపల్లిగూడెం, మర్రిపెల్లి, దేశరాజుపల్లి, అంబాల, శ్రీరాములపల్లి, గూడూరు, గూనిపర్తి, భీంపల్లి గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాళ్లపల్లి సత్యనారాయణ రావు(కన్నూరు) ఆధ్వర్యంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మండల ఇంచార్జి పేరియాల రవీందర్ రావు సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..కేసీఆర్ కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములవ్వడానికి ఇంత పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నారన్నారు. టీఆర్ఎస్పై నమ్మకంతో పార్టీలో చేరినవారందరికి పార్టీ అండగా ఉంటుందన్నారు. వచ్చే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించి టీఆర్ఎస్ సత్తా ఏంటో చూపాన్నారు.
పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు బొల్లం రాజిరెడ్డి, జిల్లా నాయకులు పుల్ల శ్రీనివాస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆకంపల్లి రమేష్, ఎంపీటీసీ పాకాల లక్ష్మి పాటు 500 మందికి పైగా పార్టీలో చేరారు. కార్యక్రమంలో మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ములుగు జిల్లాలో బాలికపై లైంగికదాడి
టీకాల కొరత : కేంద్రంపై శివసేన ఎంపీ ఫైర్
ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
నిరు పేదలకు అండగా టీఆర్ఎస్ ప్రభుత్వం
నారింజ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద